చైనా లో భారీ భూకంపం.. 111 మంది మృత్యువాత

TRINETHRAM NEWS

చైనా లో భారీ భూకంపం.. 111 మంది మృత్యువాత

చైనా లో భారీ భూకంపం సంభవించింది. చైనా లో గాన్సు- కింఘాయ్ సరిహద్దు ప్రాంతాల్లో రిక్టార్ స్కేల్ పై 6.2 తీవ్రత తో ఈ భూకంపం సంభవించిందని తెలిపారు. ఇదే గాన్సు – కింఝాయ్ సరిహద్దల్లో 2013 లో కూడా భారీ భూకంపం సంభవించింది

ఇప్పటివరకు ఈ ప్రమాదంలో 111 మంది మృత్యువాత పడగా 230 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను కూలిన భవనాల నుండి బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారు

భూమికి 35 కిలోమీటర్ల లోతున భూకంపం నెలకొందని, సహాయక చర్యలు చేపడుతున్నామని మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

You cannot copy content of this page

Scroll to Top