ఈ నెల 21న మహిళల అకౌంట్లలోకి రూ. 18,750.. బటన్ నొక్కి డబ్బులు జమ చేయనున్న సీఎం

TRINETHRAM NEWS

Trinethram News : వైఎస్సార్ చేయూత పథకం నాలుగో విడత నగదు పంపిణీ ఫిబ్రవరి 21 నుంచి ప్రారంభం కానుంది. చిత్తూరు జిల్లా కుప్పంలో జరిగే కార్యక్రమంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి పాల్గొని బటన్ నొక్కి నిధులను విడుదల చేయనున్నారు. వైఎస్సార్ చేయూత పథకం ద్వారా 45 నుంచి 60 ఏళ్ల వయసున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు ప్రతి సంవత్సరం రూ. 18,750 ఆర్థిక సాయం అందిస్తోంది వైఎస్సార్ సీపీ ప్రభుత్వం. ఇప్పటి వరకు మూడు సార్లు సాయం అందించింది. నాలుగో విడత గతేడాదే విడుదల కావాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల ఆలస్యమైంది. మొదట ఫిబ్రవరి 5న వైఎస్సార్ చేయూత నిధులు విడుదల చేయాలని ప్రభుత్వం భావించింది. కానీ అది ఫిబ్రవరి 16కు వాయిదా పడింది. కాగా, ఈ తేదీని కూడా ఫిబ్రవరి 21కి మార్చింది ప్రభుత్వం.

    ఈ స్కీమ్ ద్వారా మహిళలకు రూ. 18,750 సాయం అందుతుంది. నాలుగేళ్లలో రూ. 75,000 సాయం అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. గత మూడేళ్లలో రూ. 666.50 కోట్లను ఈ పథకం లబ్ధిదారులకు అందజేసింది. ఇందులో గ్రామీణ ప్రాంతాల్లో నివసించే మహిళలు రూ. 478.49 కోట్ల సాయం పొందగా, పట్టణ ప్రాంతాల్లో నివసించే మహిళలు రూ. 188.01 కోట్ల ప్రయోజనం పొందారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి మొత్తం 1.50 లక్షల మంది మహిళలకు రూ. 250 కోట్ల ఆర్థిక సాయం అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. శుక్రవారం నుంచి ఈ స్కీమ్ లబ్ధిదారులకు డబ్బులు అందుతాయి.

    ఎవరు అర్హులంటే..? 
  • కుటుంబ ఆదాయం నెలకు గ్రామీణ పాంతాల్లో అయితే రూ. 10 వేలు, పట్టణ ప్రాంతాల్లో అయితే రూ. 12 వేల కంటే తక్కవగా ఉండే మహిళలకే ఈ పథకం వర్తిస్తుంది.
  • కుటుంబానికి 3 ఎకరాల మాగాణి లేదా 10 ఎకరాల మెట్ట భూమి లేదా రెండూ కలిపి 10 ఎకరాలకు మించకూడదు.
  • కుటుంబ సభ్యుల్లో ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి ఉన్నా, పెన్షన్ తీసుకునేవారు ఉన్నా ఈ పథకానికి అర్హులు కాదు.
  • సొంతిల్లు లేదా అద్దె కు నివిసించేవారైనా నెలకు 300 యూనిట్ల లోపే విద్యుత్ వినియోగించాలి. గత ఆరు నెలల సగటు కూడా 300 యూనిట్లు దాట కూడదు.
  • పట్టణ ప్రాంతాల్లో 1000 చదరపు అడుగల కంటే ఎక్కువ స్థలం ఉంటే పథకానికి అనర్హులు.
  • ఆటో, ట్యాక్సీ,ట్రాక్టర్ మినహా నాలుగు చక్రాల వాహనం ఉంటే పథకానికి అనర్హులు.
  • కుటుంబంలో ఎవరూ ఆదాయపు పన్ను పరిధిలో ఉండొద్దు.
  • ఆధార్ కార్డు కలిగి ఉండాలి.
  • కుల ధ్రువీకరణ పత్రం కలిగి ఉండాలి.
  • గ్రామ లేదా వార్డు సచివాలయంలో ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఏమైనా సందేహాలు ఉంటే 1902 నంబర్ కు డయల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు.

You cannot copy content of this page

Scroll to Top