TRINETHRAM NEWS

అన్నదాత సుఖీభవ

408 వ రోజు అన్న క్యాంటీన్

స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి శత జయంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు పేద ప్రజల ఆకలి తీర్చాలన్న సంకల్పంతో బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద తెలుగుదేశం పార్టీ ఇన్ ఛార్జ్ శ్రీ వేగేశన నరేంద్ర వర్మ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ నందు నేడు 408 వ రోజు బాపట్ల కి చెందిన జంగా రత్తయ్య ఫౌండేషన్ గారి ఆధ్వర్యంలో చిన్న వీరయ్య గారి సహకారంతో దాదాపు 350 మంది పేదలకు అన్న వితరణ చేయడం జరిగింది. పేదల ఆకలి తీర్చే ఇంత మంచి కార్యక్రమంలో భాగస్వామ్యులు అయ్యి తమ సహకారాన్ని అందించిన దాతలకు నరేంద్ర వర్మ గారు ధన్యవాదాలు తెలియజేశారు.