WhatsApp Image 2024 02 15 at 21.08.22
Trinethram News : అమరావతి: నరసరావుపేట ఎంపీ, వైకాపా సభ్యత్వానికి రాజీనామా చేసిన లావు శ్రీకృష్ణదేవరాయులు త్వరలో తెదేపాలో చేరనున్నారు. గురువారం సాయంత్రం ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వచ్చిన ఆయన పార్టీలో చేరికపై చర్చించినట్టు సమాచారం. మరోవైపు చంద్రబాబు సమక్షంలో తెదేపాలో చేరేందుకు ఆళ్లగడ్డ, కోవూరు, కదిరి, నరసరావుపేట, అద్దంకి నుంచి వైకాపా నేతలు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. వందల సంఖ్యలో వాహనాల్లో తరలిరావడంతో ఉండవల్లి కరకట్టపై రాకపోకలు నిలిచిపోయాయి……
