జూన్ 27, 2026

WhatsApp Image 2023 12 17 at 12.36.48 PM

TRINETHRAM NEWS

వేములవాడ రాజన్న గర్భగుడిలో ఆర్జిత సేవలు నిలిపివేత.

రాజన్న జిల్లా డిసెంబర్ 17:రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీరాజరా జేశ్వ రస్వామి ఆలయ అధికా రులు భక్తులకు అలర్ట్ జారీ చేశారు.

గర్భగుడిలో నేడు,రేపు ఆర్జిత సేవలను తాత్కా లికంగా నిలిపేస్తున్నట్లు ఈవో కృష్ణప్రసాద్‌ వెల్ల డించారు వచ్చే ఏడాది ఫిబ్రవరి 21వ తేదీ నుంచి 24, వరకు మేడారం సమ్మ క్క,సారలమ్మ మహాజాతర కొనసాగనుంది.

ఈ జాతరకు వెళ్లే భక్తులు ముందుగా వేములవాడ రాజన్నను దర్శించుకోవడం ఆనవాయితీ ఈ నేపథ్యం లో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని జాతర పూర్త య్యేంత వరకు ఆది,సోమ వారాల్లో ఆర్జిత సేవలను నిలిపేస్తున్నట్లు ఆలయ ఈవో ప్రకటించారు.

శుక్ర శనివారాల్లో సమ్మక్క సారలమ్మ భక్తుల తాకిడి తక్కువగా ఉంటే మిగిలిన భక్తులకు గర్భగుడిలో అభిషేకం అన్నపూజల మొక్కులు చెల్లించుకు నేందుకు టికెట్లు జారీ చేస్తామని తెలిపారు.

మిగిలిన రోజుల్లో సేవలు యథావిధిగా కొనసాగు తాయని అన్నారు ఆర్జిత సేవల వివరాలు దేవస్థానం వెబ్‌సైట్‌లో పొందుపరు స్తామని ఈవో వెల్లడించారు.

భద్రాచలం శ్రీసీతారామ చంద్ర స్వామి ఆలయంలో బేడా మండపం వద్ద అధ్య యనోత్సవం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు ముక్కోటి ఉత్సవాల్లో భాగంగా శనివారం నరసింహ అవతారంలో స్వామివారు దర్శనమిచ్చారు.

స్వామివారు ఇవాళ వామ నావతారంలో దర్శన మివ్వ నున్నారు ధనుర్మాసం ప్రత్యేక పూజలు కూడా నిర్వహించనున్నారు సుప్రభాతం ఆరాధన అభిషేకం తిరుప్పావై సేవా కాలం ఉంటుందని ఆలయ అర్చకులు తెలిపారు.

You cannot copy content of this page