WhatsApp Image 2024 02 04 at 1.04.02 PM 1
ఎక్కడ కళాకారులను గౌరవిస్తారో ఆ రాజ్యం సుభిక్షంగా ఉంటుందని సినీ నటుడు చిరంజీవి అన్నారు.
పద్మ పురస్కారాలకు ఎంపికైన తెలుగు వారిని తెలంగాణ ప్రభుత్వం సత్కరించింది.
శిల్పకళావేదికలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
అభిమానుల ఆశీర్వాదాలు చూస్తుంటే తన జన్మ ధన్యమైందని అనిపిస్తోంది.
పురస్కారాలు ప్రకటించిన వెంటనే సన్మానం చేయాలనే ఆలోచన ఇంతవరకు ఎవరికీ రాలేదు.
కొన్నేళ్లుగా నంది అవార్డులను నిలిపివేయడం నిరుత్సాహపరిచింది.
వాటిని గద్దర్ అవార్డులుగా మార్చడం ఎంతో సముచితం, ఆనందం అని చెప్పారు.
