
అదనపు తరగతి గదులు, క్రీడామైదానం ప్రహరీ గోడ నిర్మాణం కోసం.
దేవరకొండ డివిజన్ జులై 16,త్రినేత్రం న్యూస్. దేవరకొండ పట్టణం లోని మునగాల కొండల్ రావు ప్రభుత్వ డిగ్రీ కళాశాల (స్వ), లో గత మూడు సంవత్సరాల నుండి పెరుగుతున్న విద్యార్థుల ప్రవేశాలకు అనుగుణంగా అదనపు తరగతి గదుల నిర్మాణం , మరియు అసంపూర్తిగా ఉన్న కళాశాల మైదానం ప్రహరీ గోడ నిర్మాణాన్ని పూర్తి చేయుటకు తగిన చర్యలు తీసుకోవాలని దేవరకొండ శాసనసభ్యులు నేనావత్ బాలు నాయక్ కి కళాశాల ప్రిన్సిపాల్ , మరియు అధ్యాపక బృందం తో కలిసి వినతి పత్రాన్ని అందజేశారు..
ఈ విషయం పైన ఆయన సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ రమావత్ రవి మరియు అధ్యాపక బృందం తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe