WhatsApp Image 2024 01 05 at 3.04.11 PM
యాదాద్రి హుండీ ఆదాయం రికార్డ్ స్థాయిలో 3.15 కోట్లు
ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రంగా రూపుదిద్దుకున్న ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తుల సంఖ్య భారీగా పెరగడంతో హుండీ ఆదాయం కూడా పెరిగింది.
28 రోజులకు గానూ ఆలయ హుండీ ద్వారా రికార్డుస్థాయిలో రూ.3.15 కోట్లకు పైగా ఆదాయం సమకూరింది.
28 సాధారణ రోజుల్లో ఆలయ ఖజానాకు హుండీ ద్వారా ఇంత పెద్ద మొత్తంలో ఆదాయం సమకూరడం ఆలయ చరిత్రలో సరికొత్త రికార్డు.
