191 ఎన్టీఆర్ నగర్ ముత్యాలమ్మ అమ్మవారి 2వ వార్షికోత్సవ సందర్బంగా పల్లకి సేవలో పాల్గొన డిప్యూటీ మేయర్

TRINETHRAM NEWS

Trinethram News : ఈరోజు నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో 7వ డివిజన్ 191 ఎన్టీఆర్ నగర్ కాలనీ వాసుల కోరిన కోరికలు నెరవేరుస్తూ కొంగుబంగారంగా పూజలు అందుకుంటున్న శ్రీ శ్రీ శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి 2వ వార్షికోత్సవ కార్యక్రమానికి ఈరోజు డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై అమ్మవారి పల్లకి సేవ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో 191ఎన్టీఆర్ శ్రీ శ్రీ శ్రీ ముత్యాలమ్మ తల్లి ఆలయ చైర్మన్ మంజునాథ్, ప్రెసిడెంట్ పూర్ణ,191 ఎన్టీఆర్ నగర్ కాలనీ ప్రెసిడెంట్ కృష్ణ,జనరల్ సెక్రటరీ పగడాల శ్రీనివాస్ రెడ్డి, శ్రీ శ్రీ శ్రీ ముత్యాలమ్మ తల్లి ఆలయ కమిటీ సభ్యులు కొండా బాబు,రామా చారీ, రాజు, బేహేరా,లక్ష్మణ్, సతీష్, దుర్గ ప్రసాద్,ఆనంద్,సురేష్ లోకేష్, వేణు గోపాల్, రాము, బాలాజీ, భక్తులు కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top