Trinethram News : సోషల్ మీడియాలో ఇంటర్ విద్యార్థి వేధింపులకు భయపడి 13 సంవత్సరాల మైనర్ బాలిక ఆత్మహత్య.. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, పోలీసుల నిర్లక్ష్యంతో తన కూతురు మరణించిందని తల్లిదండ్రుల ఆవేదన
హయత్ నగర్ పీఎస్ పరిధిలోని రంగనాయకుల గుట్ట ప్రాంతానికి చెందిన 13 సంవత్సరాల మైనర్ బాలికను, సోషల్ మీడియా అకౌంట్ నుండి అసభ్యకర మెసేజులు పెట్టి వేధించిన రోహిత్ అనే ఇంటర్ విద్యార్థి
పలుసార్లు మందలించినా మారకపోవడంతో, రోహిత్ పై రెండు రోజుల క్రితం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన బాలిక తల్లిదండ్రులు.. దీంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంటికి వెళ్లి బాలికను బెదిరించిన రోహిత్.. బెదిరింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న బాలిక
పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే పోలీసులు నిర్లక్ష్యంగా మాట్లాడారని, పోలీసుల నిర్లక్ష్యం వల్లే తన కూతురు మరణించిందని ఆవేదన వ్యక్తం చేసిన తల్లిదండ్రులు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


