Crime News : HYDలో నడిరోడ్డుపై యువకుడిపై కత్తితో దాడి

TRINETHRAM NEWS

Trinethram News : కూకట్పల్లి పరిధిలోని జగద్గిరిగుట్ట బస్టాండ్ వద్ద ఓ యువకుడిపై ఇద్దరు వ్యక్తులు కత్తులతో దాడి చేసిన ఘటన కలకలం రేపింది. దాడిలో యువకుడు తీవ్రంగా గాయపడగా, అక్కడున్న వారు అతడిని వెంటనే సమీప ఆస్పత్రికి తరలించారు. దాడి చేసిన దుండగులు ఘటన తర్వాత అక్కడినుంచి పరారయ్యారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో భయానక వాతావరణం నెలకొంది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Youth attacked with a knife

You cannot copy content of this page

Scroll to Top