TRINETHRAM NEWS

Venkateswara Swamy Kalyanam Mahotsavam

ఖని బస్టాండ్ కాలనీలో ఘనంగా

వెంకటేశ్వర స్వామి కళ్యాణం మహోత్సవం

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

గోదావరిఖని పట్టణం బస్టాండ్ కాలనీలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఆవరణలో గురువారం వెంకటేశ్వర స్వామి కళ్యాణం మహోత్సవ కార్యక్రమం కనుల పండుగ గా జరిగింది. ఆలయ 15వ వార్షికోత్సవ వేడుకల కార్యక్రమం జరిగింది.వేద పండితులు గోవర్ధనగిరి జగన్నాథచార్యులు, కలి వెండి శేషు కుమార్ శర్మ,,కంజర్ల వెంకన్న, రాజేశ్వర భవన్ సురేష్ శర్మ ల వేద మంత్రోచ్ఛారణల మధ్య ఈ వార్షికోత్సవ వేడుకలు నిర్వహించారు.

ఈ సందర్భంగా గంగానగర్ బిఆర్ఎస్ పట్టణ కమిటీ అధ్యక్షులు మాట్లాడుతూ గోదావరిఖని పట్టణంలో ఉన్న ఏకైక వెంకటేశ్వర స్వామి ఆలయంలో లోక కళ్యాణర్థం శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం వేడుకలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఆలయం ప్రారంభించిన అప్పటినుండి ప్రతి ఏటా ఈ వార్షికోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు.

అనంతరం భక్తులకు అన్నదానం నిర్వహించడం జరిగిందన్నారు.ఈ అన్నదాన కార్యక్రమానికి సహకరించిన దాతలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో మహిళ భక్తులు పాల్గొన్నారు. ఈ కళ్యాణ మహోత్సవం కార్యక్రమంలో అచ్చే వేణు, గోటిగారి శ్రీనివాస

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Venkateswara Swamy Kalyanam Mahotsavam