త్రినేత్రం న్యూస్, ప్రముఖ పుణ్యక్షేత్రంగా ఖ్యాతిగాంచిన కాణిపాకం స్వయంబు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గాల సమన్వయకర్త వేగుళ్ళ లీలాకృష్ణ, గురువారం భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు.
ఆలయానికి చేరుకున్న ఆయనకు దేవస్థాన అధికారులు, సంప్రదాయబద్ధంగా ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర ప్రజల శ్రేయస్సు, అభివృద్ధి మరియు శాంతి సౌభ్రాతృత్వాల కోసం భగవంతుని ప్రార్థించారు.
అనంతరం ఆలయ చైర్మన్ లీలాకృష్ణ,కి శాలువా కప్పి స్వామి వారి చిత్రపటాన్ని అందజేశారు. ఆలయ వేదపండితుల తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనాలు అందజేశారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


