WhatsApp Image 2025 01 28 at 09.38.15
భార్య వేధింపులు తట్టుకోలేక భర్త సూసైడ్
Trinethram News : కర్ణాటక : Jan 28, 2025,
భార్య వేధింపులతో మరో భర్త సూసైడ్ చేసుకున్న ఘటన కర్ణాటకలోని హుబ్లీలో చోటు చేసుకుంది. పీటర్, ఫిబీ(పింకీ)లకు రెండేళ్ల కిందట పెళ్లి అయింది. ఇటీవల వారి మధ్య మనస్పర్థలు రావడంతో 3నెలలుగా విడిగా ఉంటున్నారు. ‘నా భార్య నన్ను చంపుతోంది. నేను చనిపోవాలని ఆమె కోరుకుంది’ అని పీటర్ రాసిన సూసైడ్ నోట్ వైరలవుతోంది. విడాకుల కోసం ఫిబీ సోదరుడు రూ.20 లక్షలు డిమాండ్ చేశాడని, ఆఫీస్ మీటింగ్లో ఉండగా భార్య గొడవపడటంతో పీటర్ జాబ్ పోయిందని మృతుడి తండ్రి చెప్పారు.
