
లాంఛనంగా ప్రారంభించనున్న సీఎం
Trinethram News : పేదలకు రేషన్కార్డులపై సన్న బియ్యం పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఉగాది పండగ రోజు ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు.
ఏప్రిల్ 1వ తేదీ నుంచి తెలంగాణవ్యాప్తంగా అన్ని రేషన్షాపుల్లో దొడ్డు బియ్యానికి బదులుగా సన్నబియ్యం ఇచ్చేందుకు పౌరసరఫరాలశాఖ ఏర్పాట్లు చేస్తోంది. రేషన్కార్డుల్లో లబ్ధిదారుల సంఖ్యను బట్టి ఒక్కొక్కరికీ 6 కిలోల సన్నబియ్యం ఇవ్వనున్నారు.
గోదాముల్లో సిద్ధంగా 8 లక్షల టన్నులు!
వానాకాలం సీజన్ నుంచి సన్నధాన్యానికి రాష్ట్ర ప్రభుత్వం క్వింటా ధాన్యానికి రూ.500 బోనస్ ఇస్తోంది. ఇలా వచ్చిన వడ్లను రైస్మిల్లుల్లో మరాడించగా 8 లక్షల టన్నుల సన్నబియ్యం వచ్చినట్లు పౌరసరఫరాల సంస్థ వర్గాల సమాచారం. ఇవి జిల్లాల్లోని గోదాముల్లో ఉన్నాయి. అక్కణ్నుంచి మండల స్థాయి స్టాక్ పాయింట్లకు.. తర్వాత రేషన్ దుకాణాలకు బియ్యం చేరనున్నాయి. మిల్లుల్లో మరాడిస్తున్న వడ్లతో వచ్చే సన్నబియ్యం మరో 4 నెలలకు సరిపోతాయని అధికారులు చెబుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 91,19,268 రేషన్కార్డులు ఉన్నాయి. ఇందులో లబ్ధిదారులు 2,82,77,859 మంది ఉన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
