TRINETHRAM NEWS

గత నాలుగేళ్లుగా ఎన్నో ఇలాంటి అవాస్తవ ప్రచారాలు చేస్తూనే ఉన్నారు. ఇప్పటికీ ఇలాంటి ఫేక్ పోస్ట్ లు పెడుతూనే ఉన్నారు. కానీ గౌరవ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారు ఎప్పటికప్పుడు ఇలాంటి వాటిని చిరు నవ్వుతో కొట్టి పడేస్తూనే ఉన్నారు. ఎప్పటికప్పుడు వీటిని ప్రక్కకు త్రోసి ప్రజా సేవ, అభివృద్ధిలో నిమగ్నమై నడుచుకుంటున్నారు. గౌరవ ఎంపీ గారు నిజాయితీగా, నికార్సుగా ఉండే నాయకుడు,, తన మనసులోని ఏ విషయాన్ని అయినా బహిరంగంగా ప్రజలతో పంచుకునే స్వభావం కలిగిన వ్యక్తి. కాబట్టి ప్రజలు.. సోషల్ మీడియాలో వచ్చే అవాస్తవాలను నమ్మొద్దు. దయ చేసి ఎవరూ కూడా ఇలాంటి ఫేక్ వార్తలను పోస్ట్ చేయొద్దని మనవి చేస్తున్నాం.

ఇట్లు
ఎంపీ లావు శ్రీ కృష్ణ దేవరాయలు గారి కార్యాలయం.