త్వరితగతిన రాజవోలు నుండి కేశవరం ఆర్ & బి రోడ్డు నిర్మాణం పూర్తి
Trinethram News : రాజానగరం మండలంలో రాజవోలు నుండి కేశవరం ఆర్ అండ్ బి రోడ్డు నిర్మాణంలో భాగంగా కొండగుంటూరు, సంపత్ నగర్ గ్రామాల్లో జరుగుతున్న పనులను గురువారం గౌరవ స్థానిక శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ అధికారులతో కలిసి పరిశీలించారు..
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ మాట్లాడుతూ రాజవోలు నుండి కేశవరం ఆర్ అండ్ బి రోడ్డు నిర్మాణ పనులను ఈ రోజు అధికారులు మరియు కాంట్రాక్టుల తో కలసి పరిశీలించామని… త్వరితగతిన రోడ్డు పనులు పూర్తి చేసి అందుబాటులో తీసుకువచ్చేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు..
ఈ కార్యక్రమంలో జనసేన తెలుగుదేశం బిజెపి పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు..
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


