TRINETHRAM NEWS

కొవిడ్‌ జేఎన్‌.1 వేరియంట్‌ ప్రబలుతున్న నేపథ్యంలో కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ రాష్ట్రాలను అప్రమత్తం చేసింది.

ఈ మేరకు ఆ శాఖ కార్యదర్శి సుధాంశ్‌ పంత్‌ అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు లేఖ రాశారు.

ఇటీవల కాలంలో కేరళలాంటి కొన్ని రాష్ట్రాల్లో కొవిడ్‌ కేసులు పెరిగాయని, ఇదే సమయంలో కొత్త వేరియంట్‌ ప్రభావం పెరిగిందని పేర్కొన్నారు.

అందువల్ల అన్ని ప్రభుత్వాలు తగిన నియంత్రణ చర్యలు చేపట్టాలని సూచించారు.