వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్: నీళ్ల కోసం పరిగి MPDO ఆఫీసు ముందు బైఠాయించిన బర్కత్ పల్లి గ్రామస్థులు. గ్రామస్థుల వినతి పత్రం తీసుకునే అధికారులు కూడా లేరు.
పరిగి మండలం బర్కత్ పల్లి గ్రామంలో త్రాగు నీళ్లు లేక గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు, పరిగి మండల MPDO ఆఫీసు ముందు బైఠాయించి బర్కత్ పల్లి గ్రామస్థులు తన బాధను తెలిపారు, అధికారులు ఎవరు పట్టించుకోక పోవడంతో , వినతి పత్రం రాసి గ్రామస్థుల సంతకాలతో , నిరసన వ్యక్తం చేశారు, తమ బాధ పట్టించుకునే నాధుడే లేడు అని, గ్రామస్థులు తెలిపారు.
ఇందిరమ్మ రాజ్యంలో , త్రాగు నీళ్ల కోసం నానాతంటాలు పడుతున్న పరిగి ప్రజలు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


