ఆగస్ట్ 6, 2026
TRINETHRAM NEWS
Special Summary Revision

Special Summary Revision : కూకట్పల్లి జులై 14 (త్రినేత్రం న్యూస్) : హనుమాన్ నగర్ పోలింగ్ స్టేషన్ నెం.603 పరిధిలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్ ఐ ఆర్) కార్యక్రమం ఉత్సాహంగా కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో బూత్ లెవల్ అధికారులు (బి ఎల్ ఓలు) ప్రమీల, ఎం. లలిత, ఆర్. రాజేశ్వరి ఆధ్వర్యంలో ఇంటింటికీ వెళ్లి ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాలను అందజేయడంతో పాటు, నింపిన ఫారాలను స్వీకరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ డివిజన్ అధ్యక్షుడు బాలు యాదవ్, రవి తదితరులు పాల్గొని ఓటర్లను చైతన్యపరిచారు.
ఓటరు జాబితా ప్రత్యేక సవరణలో ప్రతి అర్హుడైన ఓటరు తమ వివరాలను సక్రమంగా నమోదు చేసుకునేలా ఇంటింటికీ వెళ్లి ఫారాల పంపిణీ, స్వీకరణ చేపడుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ ఓటరు వివరాలను సరిచేసుకోవాలని వారు కోరారు. ఎస్ ఐ ఆర్ కార్యక్రమంలో భాగంగా బి ఎల్ ఓ లు ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలను ధృవీకరిస్తూ, అవసరమైన ఫారాలను స్వీకరిస్తున్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page