ఆగస్ట్ 15, 2026
TRINETHRAM NEWS
Speaker

Speaker: గుంటూరు జిల్లా: త్రినేత్రం న్యూస్: ఆగస్టు 13; దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కాలం నాటి రాజకీయాలు మళ్లీ రావాలని రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అప్పన్నపాత్రుడు తెలిపారు. రాజకీయంలోకి రావాలి అనుకునేవాళ్లు కన్నా లక్ష్మీనారాయణ ను చూసి నేర్చుకోవాలని పేర్కొన్నారు.

ప్రజల మనసు దోచుకుని ఆరుసార్లు గెలిచాడు అని గుర్తు చేశారు. క్రమశిక్షణ , ప్రజల అవసరాలు తీర్చే పనితీరును ప్రశంసించారు. అయితే ప్రస్తుత రాజకీయాలు వ్యాపారంగా మారాయని మండిపడ్డారు. కన్నా లక్ష్మీనారాయణ వంటి నాయకులు మరిన్ని సేవలు అందించాలని సూచించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page