TRINETHRAM NEWS

Trinethram News : Mar 18, 2024,

కాంగ్రెస్‌లోకి మరో ఏడుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు!
పార్లమెంట్ ఎన్నికల వేళ కాంగ్రెస్ లో చేరికలు హాట్ టాపిక్ గా మారాయి. తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్ లో చేరారు. అదే బాటలో మరో ఏడుగురు ఎమ్మెల్యేలు చేరబోతున్నట్లు చర్చ జరుగుతోంది. ఇటీవల సీఎం రేవంత్‌ను కలసిన ఎమ్మెల్యేలంతా కాంగ్రెస్‌లోకి వస్తున్నట్టు చెబుతున్నారు. ఆ జాబితాలో కొత్త ప్రభాకర్ రెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, తెల్లం వెంకట్ రావు, ప్రకాశ్​గౌడ్, కాలే యాదయ్య, మహిపాల్ రెడ్డి, మానిక్ రావు ఉన్నట్టు కాంగ్రెస్ నేతలు ప్రచారం చేస్తున్నారు.