జూన్ 26, 2026
TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా వారోత్సవాలలో భాగంగా ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం కొమరం భీమ్ నగర్ గ్రామంలో వలస గోత్తి కోయలకు చీరలు పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ములకలపల్లి ఎస్సై రాజశేఖర్ చేతుల మీదుగా చీరలు 35 మందికి పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది.
ఎస్సై రాజశేఖర్ మాట్లాడుతూ ఖాసిం పాల్వంచ నుంచి వచ్చి ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. భవిష్యత్తులో ఇంకా మరెన్నో కార్యక్రమాలు చేయాలని ఆకాక్షించారు. ఈ కార్యక్రమంలో లాయర్ గోలి సందీప్ కూమార్ ,గద్దర్ భాషా, షేక్ మస్తాన్, గంగయ్య మరియు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Saree distribution program on

You cannot copy content of this page