TRINETHRAM NEWS

డిజిటల్ టెక్నాలజీ సాయం తీసుకుంటున్న ఆర్పీఎఫ్

సీఈఐఆర్ సాయంతో ఐఎంఈఐ నెంబరును బ్లాక్ చేసే సదుపాయం
తద్వారా, చోరీకి గురైన ఫోన్ ను పనిచేయకుండా చేసే అవకాశం
ఫోన్ ను ట్రాక్ చేసే వెసులుబాటు
Trinethram News : రైలు ప్రయాణికులకు ఇది ఒక శుభవార్త. ఇకపై రైలులో మీ ఫోన్ పోగొట్టుకున్నా, దొంగతనానికి గురైనా చింతించాల్సిన పనిలేదు. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF), టెలికమ్యూనికేషన్ శాఖకు చెందిన సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ (CEIR) పోర్టల్‌తో జతకట్టింది. మీ పోగొట్టుకున్న లేదా దొంగిలించబడిన మొబైల్ ఫోన్‌లను దీని ద్వారా తిరిగి పొందేందుకు వీలు కలుగుతుంది.

ఈ సందర్భంగా ఆర్పీఎఫ్ డైరెక్టర్ జనరల్ మనోజ్ యాదవ్ మాట్లాడుతూ… పోగొట్టుకున్న లేదా కనిపించకుండా పోయిన మొబైల్ ఫోన్‌లను తిరిగి పొందేందుకు డిజిటల్ టెక్నాలజీని ఉపయోగించడం ద్వారా ప్రయాణికులకు పారదర్శకమైన మరియు సమర్థవంతమైన విధానాన్ని అందించడమే తమ లక్ష్యమని అన్నారు.

CEIR పోర్టల్ అంటే ఏమిటి? ఎలా పనిచేస్తుంది?
CEIR పోర్టల్ అనేది IMEI నంబర్‌ను బ్లాక్ చేయడం ద్వారా మొబైల్ ఫోన్‌లను తిరిగి పొందేందుకు, పోగొట్టుకున్న లేదా దొంగిలించబడిన పరికరాలను ట్రాక్ చేయడం మరియు నిర్వహించడం కోసం టెలికమ్యూనికేషన్ శాఖ రూపొందించిన ఒక ప్రత్యేకమైన డిజిటల్ వేదిక. దీని ద్వారా మీ ఫోన్ పోగొట్టుకున్న వెంటనే ఫిర్యాదు చేస్తే, మీ ఫోన్ ఎవరూ వాడకుండా దానిని బ్లాక్ చేయవచ్చు.

ఫిర్యాదు ఎలా చేయాలి?
మీరు Rail Madad పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో లేదా 139కి డయల్ చేయడం ద్వారా మీ ఫిర్యాదును నమోదు చేయవచ్చు.

ఈ కొత్త విధానంతో, రైల్వే ప్రయాణికులు తమ పోగొట్టుకున్న ఫోన్‌లను తిరిగి పొందే అవకాశం పెరుగుతుంది. దీని ద్వారా ప్రయాణికులకు మరింత సురక్షితమైన ప్రయాణ అనుభూతి కలుగుతుందని రైల్వే శాఖ భావిస్తోంది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

RPF-CEIR pact to