TRINETHRAM NEWS

కాంగ్రెస్ సమావేశానికి తరలివెళ్లిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు.

Trinethram News : ఈరోజు హైదరాబాద్ ఎల్బీ స్టేడియం లో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఎఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే ముఖ్య అతిథిగా నిర్వహిస్తున్న బూత్ లెవెల్ కన్వీనర్ల శిక్షణా శిబిరానికి కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నుండి టిపిసిసి ప్రధాన కార్యదర్శి నర్సారెడ్డి భూపతి రెడ్డి గారి సారధ్యంలో బూత్ లెవెల్ ఏజెంట్లతో నియోజకవర్గం నుండి వారు ఏర్పాటు చేసినటువంటి బస్సులలో పెద్ద ఎత్తున తరలి వెళ్లడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో మున్సిపాలిటీ అధ్యక్షులు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు మాజీ సర్పంచులు వార్డు మెంబర్లు నాయకులు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది.