WhatsApp Image 2024 08 05 at 22.24.09
Purity Green Program in 13th Division
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
గోదావరిఖని విఠల్ నగర్ 13వ డివిజన్లో కార్పొరేటర్ రాకం లత దామోదర్ గారి ఆధ్వర్యంలో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగినది, ఈ కార్యక్రమంలో భాగంగా డివిజన్ ప్రజలకు పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉంచుకోవాలని లేని ఎడల దోమల ద్వారా విష జ్వరాలు వస్తాయని అవి ఒకరి నుండి ఒకరికి వ్యాప్తిస్తాయని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అదేవిధంగా మొక్కలను డివిజన్లో పంచడం జరిగిందని నాటిన మొక్కలను కాపాడుకోవాలని, తద్వారా పచ్చదనం పెంచుతూ చక్కటి వాతావరణం పెంపుతూ పొల్యూషన్ తగ్గి స్వచ్ఛమైన గాలి అందుతుందని తెలియజేయడం జరిగినది.
ఇంకా ఈ కార్యక్రమంలో వార్డు ఆఫీసర్ స్వప్న సూపర్వైజర్స్ శ్రీను,నవీన్,ఆర్పిలు స్వప్న మహేశ్వరి,ఊర్మిళ, అంగన్వాడీ టీచర్లు మినాజ్, పద్మ, స్వరూప, భాగ్యలక్ష్మి, ఆశా వర్కర్ కనక లక్ష్మీ డివిజన్ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగినది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
