TRINETHRAM NEWS

Trinethram News : పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం జాతీయ హోదా కల్పించి దండిగా నిధులు విడుదల చేసినందుకు దానికి ప్రధాని మోదీ పేరు నామకరణం చేయాలని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు కోరారు.

రాజ్యసభలో పోలవరంపై జరిగిన చర్చలో మాట్లాడారు.

ఈ ప్రాజెక్టుకు ప్రతి పైసా కేంద్ర ప్రభుత్వమే ఇస్తున్నందున తాను చేసిన విజ్ఞప్తికి కేంద్ర జల్‌శక్తి మంత్రి స్పందిచాలని కోరారు.

ఇప్పటికి పోలవరం నిర్మాణం కోసం రూ.15.146 కోట్లు ఇచ్చినట్లు కేంద్రమంత్రి తెలిపారు.