WhatsApp Image 2024 04 03 at 2.57.19 PM
Trinethram News : జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. జ్వరం తీవ్రత ఎక్కువగా ఉన్నందున విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు.
ఈ రోజు తెనాలిలో చేపట్టాల్సిన వారాహి విజయ భేరి కార్యక్రమంతో పాటు ఉత్తరాంధ్ర పర్యటన వాయిదా వేశారు.
కనీసం రెండుమూడు రోజుల విశ్రాంతి అవసరం అని వైద్యులు తెలిపారు.
రీ షెడ్యూల్ చేసి పర్యటన పునః ప్రారంభిస్తారు.
రీ షెడ్యూల్ చేసిన కార్యక్రమాన్ని త్వరలో ప్రకటిస్తారు..
