
ఎన్నికకు సహకరించిన రాష్ట్ర ఏఐటియూసి నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు..
డిండి (గుండ్లపల్లి) ఏప్రిల్ 13 త్రినేత్రం న్యూస్. భవన నిర్మాణ కార్మిక సంఘం నల్గొండ జిల్లా ఏడవ మహాసభ కేసీఆర్ ఫంక్షన్ హాల్లో జరిగింది. జిల్లా ప్రధాన కార్యదర్శిగా డిండి మండలం. తవకళాపూర్ గ్రామానికి చెందిన నూనె వెంకటేశ్వర్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఈ సందర్భంగా నూనె వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కార్మికుల సమస్యల పరిష్కారం కొరకు నిరంతరం పని చేసే పని సేవలను గుర్తించి తిరిగి రెండవసారి ఏకాగ్రీవంగా ఎంపిక చేసినట్లు ఆయన చెప్పారు. జిల్లాలోని భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం శక్తి వంచన లేకుండా పనిచేస్తానని ఆయన చెప్పారు.
నా ఎన్నికకు సహకరించిన రాష్ట్ర ఏఐటియుసి నాయకులకు భావన నిర్మాణ కార్మికుల సంఘం నాయకులకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నానని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
