WhatsApp Image 2024 01 06 at 9.46.58 AM
Trinethram News : 6th Jan 2024
ఏపీలో కొత్తగా 1,11,321 రేషన్ కార్డులు మంజూరు
రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా 1,11,321 రేషన్ కార్డులు మంజూరు చేసింది. వీరందరికీ తహసీల్దార్ డిజిటల్ సంతకం పూర్తయిన వెంటనే రేషన్ కార్డులు ముద్రించి వాలంటీర్ల ద్వారా పంపిణీ చేస్తున్నారు.
సంక్రాంతి పండుగ సందర్భంగా వీరికి ఈ నెల నుంచే రేషన్ అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొత్త రేషన్ కార్డు లేకపోయినా జాబితాలో పేరు ఉన్న వారికి వారి ఆధార్ ఆధారంగా రేషన్ తీసుకునేలా ఏర్పాట్లు చేశామని అధికారులు వెల్లడించారు.
