MLA KP Vivekanand : పెండింగ్ లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలి : ఎమ్మెల్యే కెపి.వివేకానంద్

TRINETHRAM NEWS

పెండింగ్ లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలి : ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ …

ఈరోజు కుత్బుల్లాపూర్ సర్కిల్ కార్యాలయంలో ఇంజనీరింగ్ శాఖ అధికారులతో ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గాజులరామారం సర్కిల్ పరిధిలోని వివిధ కాలనీలలో నిర్మాణ దశలో, పెండింగ్ లో ఉన్న పనులపై ఆరా తీశారు.

అనంతరం ఎమ్మెల్యే కెపి. వివేకానంద్ మాట్లాడుతూ గాజులరామారం సర్కిల్ పరిధిలోని అన్ని డివిజన్ల లో పెండింగ్ లో ఉన్న పనులను వెంటనే పూర్తి చేసి ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలన్నారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మల్లారెడ్డి, డిఈ శిరీష, ఏఈలు కళ్యాణ్, తిరుపతి ఇంజనీరింగ్ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page

Scroll to Top