TRINETHRAM NEWS

Trinethram News : హైదరాబాద్: మేడిగడ్డ బ్యారెజ్ సందర్శనకు ఏర్పాట్లు చేయాలని నీటి పారుదల శాఖ అధికారులను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. మేడిగడ్డలో పిల్లర్ కుంగడం చాల తీవ్రమైన అంశమన్నారు. నీటి పారుదల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి జలసౌధలో ఆ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి ఉత్తమ్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్ కుంగడంపై మంత్రికి అధికారులు వివరణ ఇచ్చారు. “ ఒక పిల్లర్ 1.2 మీటర్లు కుంగడంతో.. మరో మూడు పిల్లర్లపై ఆ ప్రభావం పడింది. ముందురోజు సాయంత్రం పిల్లర్ కుంగిన వెంటనే ప్రాజెక్టులో నీటిని తోడేశాం. ఆ తర్వాత కుంగడం తగ్గింది” అని చెప్పారు.