TRINETHRAM NEWS

గత ప్రభుత్వం అవసరం లేకున్నా ఉత్తర తెలంగాణ కోసం కాళేశ్వరం కట్టారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు.

సూర్యపేటలో తాగునీరు లేక మూసీ నీళ్లు తాగుతున్నారని, నల్లగొండ జిల్లాకు కేసీఆర్, బీఆర్‌ఎస్ అన్యాయం చేశారని పేర్కొన్నారు.

తెలంగాణకు కాంగ్రెస్ అన్యాయం చేస్తుందని తమ పదవులను గడ్డిపోచల్లా వదులుకున్నామని మంత్రి గుర్తుచేశారు.

పోతిరెడ్డిపాడు కోసం వైఎస్ హయాంలో 2005 సెప్టెంబర్ 13న జీవో తెచ్చారని చెప్పారు.