Trinethram News : అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలం, పొన్నేటిపాలెం వద్ద అడవి పందులకు వేటగాళ్లు అమర్చిన ఉచ్చులో చిరుత పులి చిక్కుకుని బుధవారం మృతి చెందిన విషయం తెలిసిందే. ఆటోలకు ఉపయోగించే బ్రేక్ వైర్లను వేట గాళ్లు అడవి పందులను చంపేందుకు ఉచ్చులకు ఉపయోగించారు. నీళ్లు, ఆహారం వెతుక్కుంటూ అడవికి ఆనుకున్న పొలం వద్దకు వచ్చిన చిరుత పులి వేట గాళ్ల అమర్చిన ఉచ్చులో చిక్కుకుని మృతి చెందింది. గంటల తరబడి చిరుత పులి వేటగాళ్లు వచ్చి నుంచి బయటపడేందుకు నరకం అనుభవించింది.
అధికారులు మాత్రం ఆశ్రితపులని కాపాడలేకపోయారు. చిరుత పులి వేటగాళ్లు బుజ్జిలో చిక్కుకున్నప్పటికీ నిండు గర్భిణీ.. కడుపులో రెండు కూనలు ఉన్నాయి. చనిపోయిన తర్వాత చిరుత పులికి పోస్టుమార్టం నిర్వహించిన పశు వైద్యులకు చిరుత పులి గర్భంలో పిల్లలు ఉండడం గమనించి షాక్కు గురి అయ్యారు. అయ్యో దేవుడా మరో 20 రోజులు ఉండి ఉంటే ఆ పిల్లలు బతికుండే వనీ.. తల్లితో పాటు అవి కూడా చని పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


