WhatsApp Image 2024 09 26 at 07.44.35
వృద్ధ దంపతుల విడాకుల కేసులో అలహాబాద్ హైకోర్టు వ్యాఖ్య
Trinethram News : ఈ కేసును చూస్తే.. అలహాబాద్ హైకోర్టు వ్యాఖ్యతో ఎవరైనా ఏకీభవించాల్సి వస్తుందేమో! ఎందుకంటే ఆమె వయసు 75 ఏళ్లు. 80 ఏళ్ల భర్తతో విడాకులు, భరణం కోరుతూ ఫ్యామిలీ కోర్టుకెక్కింది. కోర్టు ఆమెకు అనుకూలంగా తీర్పునివ్వడంతో భర్త హైకోర్టును ఆశ్రయించాడు.
అలీగఢ్కు చెందిన మునేశ్కుమార్ గుప్తా ఈ పిటిషన్ను దాఖలు చేశారు. దీనిని మంగళవారం విచారించిన అలహాబాద్ హైకోర్టు, ‘కలియుగం వచ్చేసినట్లే కనిపిస్తోంది’ అని వ్యాఖ్యానించింది. అయితే వృద్ధ దంపతులు అవగాహనకు వచ్చేందుకు ఒక అవకాశమిస్తున్నట్లు పేర్కొంటూ కేసు విచారణను వాయిదా వేసింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
