TRINETHRAM NEWS


It is the responsibility of every Indian citizen to show patriotism as the children of Mother India

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

భరతమాత బిడ్డలుగా దేశబక్తి చాటాల్సిన బాధ్యత ప్రతీ ఒక్క భారతీయ పౌరుడి మీద ఉందన్నారు బిజేపి

రామగుండం ఇంచార్జి కందుల సంధ్యారాణి.
పెద్దలు భారత ప్రధాని పిలుపు మేరకు బిజేపి రాష్ట్ర అద్యక్షులు కిషన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈరోజు హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా మహనీయుల విగ్రహల శుద్ది కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రామగుండం నియొజకవర్గంలో ఘనంగా నిర్వహించారు
గాంధీ మరియు అంబేద్కర్ విగ్రహాలని శుభ్రం చేసి పాలాభిషేకం చేశారు..
ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి కందుల సంధ్యారాణి మాట్లాడుతూ
దేశం మనకేమి ఇచ్చింది అని కాకుండా, దేశానికి మనం ఎం చెసామనే నినాధంతో భారతపౌరులు ముందుకెల్లాలని అన్నారు

హక్కుల కోసం పొరాడడమే మన భాధ్యత కాదని, దేశాన్ని కాపాడుకోవడం కూడా మన భాధ్యతనేనని అన్నారు

దేశంకోసం,ధర్మంకోసం పనిచేస్తూ పేద బడుగు బలహీన వర్గాల అబ్యున్నతి కోసం పనిచేస్తున్న, భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి పిలుపుని భారతీయ జనతా పార్టీ శిరసావహిస్తున్నదని అన్నారు.
ఈ ప్రాంతంలో ఉన్న ప్రతీఒక్కరూ మన వంతు భాద్యతగా స్వాతంత్రదినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతీ ఒక్కరి ఇంటీపైన జాతీయ జెండాని ఆవిష్కరించాలని కోరారు
ఈ పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న ఎన్.టి.పీ.సి ,ఆర్.ఎఫ్.సి.ల్,సింగరేణి కంపెనీల యాజమాన్యం కార్మికులకి జాతీయ జెండాలని అందించి కార్మికులలో, కార్మిక కుటుంబాలలో జాతీయతాభావం పెంపొందించేవిధంగా కంపెనీల యాజమాన్యం ముందుకు రావాలని కోరారు
దేశభక్తిని చాటే ఈ మహోత్తర కార్యక్రమంలో అన్ని వర్గాల ప్రజలు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు

ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు మెరుగు హనుమంత్ గౌడ్, గాండ్ల ధర్మపురి, కాసిపేట శివాజీ మండల అధ్యక్షులు కోడూరు రమేష్,గుండబోయిన భూమయ్య,మిట్టపల్లి సతీష్,గొపగాని నవీన్ గౌడ్ నాయకులు పెద్దపల్లి రవీందర్, సుల్వ లక్ష్మీనారాయణ,బూడిద రమేష్,అందే రాజ్ కుమార్,పంగ రవి,తడగొండ నరసయ్య,మచ్చ విశ్వాస్,తోట కుమారస్వామి, బాసబోయిన వాసు,భాస్కర్,దాసరి ఉషాల్,గుండబోయిన సతీష్,మామిడి వీరేశం,అజయ్ గంధం, బియ్యాల మహేందర్,బలరాం,కుమ్మరి తిరుపతి, రాకేశ్,మెరుగు శ్రీనివాస్, బరుపటి నారాయణ,పెండ్యాల రఘు,మల్లేష్ తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

It is the responsibility of every Indian citizen to show patriotism as the children of Mother India