
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్షలో దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్.
Irrigation Projects : దేవరకొండ ఆగస్టు 18: త్రినేత్రం న్యూస్.. దేవరకొండ నియోజకవర్గం పరిధిలో కొనసాగుతున్న సాగునీటి పారుదల ప్రాజెక్టుల పురోగతిపై రాష్ట్ర సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తో దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా నియోజకవర్గంలోని వివిధ ఇరిగేషన్ ప్రాజెక్టుల ప్రస్తుత పరిస్థితి, నిర్మాణ పనుల పురోగతి, పెండింగ్లో ఉన్న అంశాలు, పనులు పూర్తిచేయడంలో ఎదురవుతున్న సమస్యలపై మంత్రితో ఎమ్మెల్యే బాలు నాయక్ చర్చించారు. రైతులకు సాగునీరు అందించడమే లక్ష్యంగా ప్రాజెక్టుల పనులను మరింత వేగవంతం చేసి, నిర్దేశిత సమయంలో పూర్తి చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ని కోరారు.
దేవరకొండ నియోజకవర్గంలో సాగునీటి ప్రాజెక్టులు పూర్తయితే రైతాంగానికి ఎంతో మేలు జరుగుతుందని ఎమ్మెల్యే బాలు నాయక్ తెలిపారు. సాగునీటి లభ్యత పెరగడంతో ప్రస్తుతం వర్షాధారంగా సాగు చేస్తున్న అనేక ప్రాంతాలకు భరోసా ఏర్పడుతుందని, సాగు విస్తీర్ణం పెరగడంతో పాటు రైతులు ఒకే పంటపై ఆధారపడకుండా వివిధ పంటలను సాగు చేసుకునే అవకాశం కలుగుతుందని అన్నారు.
ప్రాజెక్టుల ద్వారా చెరువులు, కుంటలు మరియు భూగర్భ జలాలు కూడా మరింతగా సమృద్ధి చెందే అవకాశం ఉండటంతో దేవరకొండ నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయానికి స్థిరమైన నీటి వనరులు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. సాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తే రైతుల ఆదాయం పెరగడంతో పాటు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని అన్నారు.
రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రాజెక్టుల పనులకు అవసరమైన అనుమతులు, నిధులు మరియు ఇతర పరిపాలనా చర్యలను వేగవంతం చేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ని ఎమ్మెల్యే బాలు నాయక్ కోరారు. మంత్రి సానుకూలంగా స్పందించి ప్రాజెక్టుల పురోగతిపై అధికారులతో సమన్వయం చేస్తూ అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe