TRINETHRAM NEWS

Trinethram News : ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్ రాజు ని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జగద్గిరిగుట్ట పై వెలిసిన శ్రీమల్లికార్జున స్వామి భ్రమరాంభిక, కేతమ్మ ఆలయ కమిటీ సభ్యులు ఈరోజు శంభీపూర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. మహా శివరాత్రి పండుగను పురస్కరించుకొని ఈ నెల 8వ తేదీన జరుగనున్న శ్రీమల్లికార్జున స్వామి భ్రమరాంభిక కళ్యాణ మహోత్సవానికి రావాలని ఆహ్వాన పత్రికను అందజేసి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ జేకే శేఖర్ యాదవ్, సింహ యాదవ్, సమ్మయ్య యాదవ్, రేణుక యాదవ్, ఆంజనేయులు యాదవ్, కుమార్, ఎల్లేష్ యాదవ్, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.