గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. ఈరోజు గోదావరిఖని లోని బార్ అండ్ రెస్టారెంట్ లకు రామగుండం నగర పాలక సంస్థ జరిమానా విధించింది అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) కమిషనర్ జె. అరుణ ఆదేశాల మేరకు మున్సిపల్ ప్రజారోగ్య విభాగం అధికారులు మంగళ వారం సాయంత్రం పలు బార్ అండ్ రెస్టారెంట్ లలో తనిఖీలు నిర్వహించారు. ఈ సంధర్భంగా నిషేధిత ప్లాస్టిక్ గ్లాసులను ఉపయోగిస్తున్న తిరుమల బార్ అండ్ రెస్టారెంట్ , రామాంజనేయ బార్ అండ్ రెస్టారెంట్ల కు రూ 5000/- చెత్త బహిరంగ ప్రదేశాలలో పడ వేసిన నాగులమ్మ బార్ అండ్ రెస్టారెంట్ కు రూ . 2000/- జరిమానా విధించారు. ఈ తనిఖీలలో సానిటరీ ఇన్స్పెక్టర్లు సంపత్ , నాగ భూషణం ఆద్వర్యంలో ఎన్విరాన్ మెంటల్ ఇంజనీర్ మధుకర్ , జవాన్లు అశోక్ సంపత్ , సోమేశ్ , దయానంద్ తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


