TRINETHRAM NEWS

రాంలీల కార్యక్రమానికి భారీ ఏర్పాట్లు

చొప్పదండి : త్రి నేత్రం న్యూస్

విజయదశమి పురస్క రించుకొని చొప్పదండి హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా నిర్వహించేందుకై భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు ఉత్సవ సమితి సభ్యులు తెలిపారు.
ఈ సందర్భంగా రాంలీలా ఉత్సవ సమితి కన్వీనర్ కటుకం మహేష్ మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి ముఖ్య వక్తగా రాధా మనోహర్ దాస్ రామబాణం సంధించిచండానికి అల్ఫోరెస్ విద్యాసంస్థల అధినేత వి. నరేందర్ రెడ్డి విచ్చేస్తున్నట్లు అదే విధంగా సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రసంగాలతో ఈ కార్యక్రమానికి ప్రత్యేక శోభను తీసుకొచ్చే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. కావున హిందూ బంధువులందరూ పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయగలరని కోరారు.
ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ అధ్యక్షుడు పడకంటి క్రిష్ణ, వ్యవస్థా ప్రముఖ్ చేపూరి సత్యనారాయణ, హిందూ ఉత్సవ సమితి కన్వీనర్ ఎన్నం మునిందర్, కో-కన్వీనర్లు మోలుమురి రమేష్,
నాయకులు దండె లింగన్న, సిరిపురం శ్రీనివాస్, దూస రాము, దండె సత్యానందం, దండే మహేష్, గుండేటి శివ శంకర్, చల్ల అనూష్, తాడూరి రామకృష్ణ, జిట్ట కుమార్, ఇప్పన పెళ్లి రాజేశం, మోలుమురి రాజేశం, రొడ్డవేని రాజు, పిట్టల రఘు, బ్రహ్మణపెళ్లి నాగరాజు, బొమ్మిడి రాజేందర్, గాజుల రాజు, పాకాల మహేష్ తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App