TRINETHRAM NEWS

మహారాష్ట్ర – ఇందాపూర్‌లో అవినాశ్ ధన్వే అనే వ్యక్తి తన స్నేహితులతో కలిసి భోజనం చేసేందుకు రాగా, 6-7 మంది దుండగులు అతనిపై దాడి చేశారు. కుర్చీలో కూర్చున్న అతడిని వెనుక నుంచి వచ్చిన ఇద్దరు మొదట గన్‌తో కాల్చారు. అతడు కుప్పకూలగా మరో ఐదుగురు వచ్చి కత్తులతో క్రూరంగా నరికి చంపారు.

పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.