TRINETHRAM NEWS

సీపీఐ,ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ సంబురాలు.

సీపీఐ, ఏఐటీయూసీ కుత్బుల్లాపూర్ నియోజకవర్గ సమితి తరపున షాపూర్ నగర్,ఐడీపీఎల్, జగతగిరిగుట్ట, మక్దుం నగర్,గుబురుగుట్ట ,ఆస్బెస్టాస్ కాలనీ,హెచ్ఏంటీ ల లో 75 వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఘనంగా త్రివర్ణపతకాలను ఎగురవేయ్యడం జరిగింది.
ఈ సందర్భంగా జెడిమెట్ల హమాలి అడ్డ వద్ద సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ రావు గారు, ఐడీపీఎల్ వద్ద ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ వెంకట్ రెడ్డి గారు,షాపూర్ నగర్ కార్యాలయం వద్ద ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు యూసుఫ్ గారు,జగత్ గిరి గుట్ట,మక్దుం నగర్లో సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి ఉమా మహేష్, హెచ్ఏంటీ వద్ద ఏఐటీయూసీ అధ్యక్షుడు హరినాథ్,జగతగిరిగుట్ట ఆటో అడ్డ వద్ద ప్రజానాట్యమండలి అధ్యక్షుడు ప్రవీణ్ లు పాల్గొనగా సీపీఐ మండల సహాయ కార్యదర్శులు దుర్గయ్య, రాము,ఏఐటీయూసీ అధ్యక్ష,కార్యదర్శి స్వామి, శ్రీనివాస్, మునిసిపల్ అధ్యక్షుడు రాములు,శాఖ కార్యదర్శులు సహదేవ్ రెడ్డి, సుధాకర్, జార్జ్,కార్యవర్గ సభ్యులు కృష్ణ,జగత్రెడ్డి, ఖయుమ్,బాలరాజ్, రాజు,చంద్రయ్య, నర్సింహ, జాఫర్,చంద్,పాషా,కుమార్,ఎల్లస్వామి,ముసలెయ్య,సామెల్,సుంకిరెడ్డి, నర్సింహారెడ్డి, కనకయ్య,గురప్ప,లతో పాటు వందలాది మంది కార్యకర్తలు పాల్గొన్నారు.