TRINETHRAM NEWS

రుక్మిణి ఎస్టేట్ లో ఘనంగా అయ్యప్ప మహా పడిపూజా…

ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే కేపీ. వివేకానంద గారు….

ఈరోజు 132- జీడిమెట్ల డివిజన్ రుక్మిణి ఎస్టేట్స్ లో గురు స్వామి శంకర్ ఆధ్వర్యంలో నిర్వహించిన అయ్యప్ప మహా పడిపూజ కార్యక్రమానికి ఎమ్మెల్యే కేపీ.వివేకానంద గారు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ.వివేకానంద గారు మాట్లాడుతూ హరిహర సుతుడు ఆ అయ్యప్పను పూజించడం ద్వారా అష్టైశ్వర్యాలు, మానసిక ప్రశాంతత చేకూరుతుందన్నారు.

ఈ మహా పడిపూజ కార్యక్రమంలో పోచమ్మ గుడి టెంపుల్ ఇంచార్జ్ ప్రభాకర్ ముద్దాపురం, గజా గురుస్వామి, ప్రవీణ్ గురు స్వామి, దుర్గారావు గురుస్వామి, మణికంఠ, సాయికుమార్ ముద్దాపురం తదితరులు పాల్గొన్నారు.