TRINETHRAM NEWS

శ్రీశైలం రిజర్వాయర్‌లో చేపలు మృత్యువాత పడ్డాయి.

శ్రీశైలం డ్యామ్ ముందు భాగంలోని పెద్ద బ్రిడ్జ్ పక్కన గేజింగ్ మడుగులో కుప్పలు తెప్పలుగా భారీగా చేపలు మృతి చెందాయి.

శ్రీశైలం రిజర్వాయర్‌లోని ముందు బాగంలో వాటర్ రంగు మారింది.

లింగాలగట్టు సమీపంలోని రిజర్వాయర్‌లో చేపలు చనిపోవడంతో మత్స్యకారులు, స్దానికులు భయాందోళనలకు గురవుతున్నారు.

గత ఐదు రోజులుగా చేపలు చనిపోతున్నాయని లింగాలగట్టు గ్రామస్థులు చెబుతున్నారు.