దేవరకొండ ఏ ఎస్ పి మౌనిక.
దేవరకొండ 14 జూన్ త్రినేత్రం న్యూస్. ప్రజలు సైబర్ నేరగాళ్ల వలలో పడకూడదని దేవరకొండ ఏ ఎస్ పి మౌనిక కోరారు. టెలిగ్రామ్ ,వాట్సప్, ఫేస్బుక్ లలో వచ్చే నకిలీలోన్ యాప్స్ లింకులను క్లిక్ చేసి ఓ టి పి లు చెప్పకూడదని అన్నారు. మోసగాళ్ళ ఫోన్ కాల్స్ మాయలోపడి ఎంతో కష్టపడి సంపాదించిన సొమ్మును పోగొట్టుకోవ్వద్దని సూచించారు.అధిక సొమ్ముకు ఆశ చూపి పెట్టుబడులు కోరితేఅత్యాశకు పోవద్దు అని తెలియజేశారు. డబ్బులు పోతే తిరిగి పొందడం చాలాకష్టం అన్నారు. ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని కోరారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


