అంబీర్ చెరువు ను అత్యంత సుందరంగా తీర్చిదిద్దుతాం – డిప్యూటీ మేయర్, కార్పొరేటర్

TRINETHRAM NEWS

Trinethram News : నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రగతి నగర్ అంబీర్ లేక్ పరిసరాలు మరియు వాకింగ్ ట్రాక్ సమస్య లను వాకర్స్ తో అడిగి తెలుసుకున్న డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ మరియు 8వ డివిజన్ కార్పొరేటర్ సురేష్ రెడ్డి. ఈ సందర్బంగా డిప్యూటీ మేయర్ మాట్లాడుతూ మార్నింగ్ వాకర్స్ మేరకు అంబీర్ చెరువు పరిశీలించి వాకర్స్ సమస్య లను ఎమ్మెల్సీ శంభిపూర్ రాజు, ఎమ్మెల్యే కేపీ వివేకానంద, మేయర్ కోలన్ నీలా గోపాల్ రెడ్డి ద్రుష్టి కి తీసుకుని పోయి సంబంధిత అధికారులతో చర్చించి తొందర్లోనే అత్యుత్తమ సౌకర్యాలతో, ప్రజలకు ఆహ్లాదం పంచేలా అభివృద్ధి చేస్తామని తెలిపారు. వాకింగ్ చేసుకోవడానికి వచ్చే ప్రజలకు ,వృద్దులకు, పిల్లలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వాకింగ్ ట్రాక్ ను అన్ని హంగులతో ,సకల సౌకర్యాలతో అన్ని రకాల మౌలిక వసతులు కలిపిస్తామని డిప్యూటీ తెలియచేసారు.ఈ కార్యక్రమంలో మార్నింగ్ వాకర్స్, సీనియర్ సిటిజెన్, ప్రజలు తదితరులు పాల్గొన్నారు..

You cannot copy content of this page

Scroll to Top