TRINETHRAM NEWS

తెలుగుదేశం పార్టీ తోనే దళితులకు న్యాయం

వేగేశన నరేంద్ర వర్మ
బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్

స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ఈస్ట్ పిన్నిబోయినవారిపాలెం కు చెందిన వైసిపి నాయకులు బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ శ్రీ వేగేశన నరేంద్ర వర్మ గారి చేతులు మీదుగా తెలుగుదేశం పార్టీ కండువాలు కప్పుకొని పార్టీ లోకి చేరారు

ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ..

వైసిపి అరాచక పాలనలో దళితుల మీద ఎన్నో దాడులు చేసారు.దళితులకు సరైన న్యాయం చేయలేదు.

తెలుగుదేశం పార్టీ తోనే దళితులకు న్యాయం జరుగుతుంది. అధికారం లోకి రాబోయేది తెలుగుదేశం పార్టీనే

మీ అందరికి అండగా నేను వుంటా ప్రతి ఒక్కరు కస్టపడి పనిచేయండి అధికారం లోకి రాగానే మీ అందరికి అండగా నిలుస్తాను , పార్టీ లో సముచిత గౌరవ స్థానం కల్పిస్తానన్నారు

ఈ కార్యక్రమములో తెలుగుదేశం పార్టీ నాయకులు,కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.