TELANGANA

MLC Thota Trimurthulu : ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు కు పరామర్శలు

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ ఫిబ్రవరి, 07.. మండపేట మండపేట నియోజకవర్గ వైసీపీ ఇన్ ఛార్జ్, రాష్ట్ర సబ్ ఆర్డినేటర్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు అన్న తోట సత్యనారాయణ ఇటీవల మృతి చెందారు. దీంతో మండపేట వైసిపి నాయకులు పలువురు ఆయన్ని పరామర్శించారు. రామచంద్రాపురం మండలం వెంకటాయపాలెం లోని వారి స్వగృహంలో ఆయన్ని పరామర్శించారు.

ఈ సందర్భంగా దివంగత తోట సత్యనారాయణ చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమం లో వైసీపీ రాష్ట్ర కార్యదర్శి లు రెడ్డి రాధాకృష్ణ, కర్రి పాపారాయుడు, సొసైటీ మాజీ చైర్మన్ పెంకే గంగాధర్, కౌన్సిలర్ పిల్లి శ్రీనివాస్, రాష్ట్ర వైస్సార్ టి.యి.సి. కార్యదర్శి శెట్టి నాగేశ్వరావు, కుడుపూడి రాంబాబు, సూరంపూడి సత్య ప్రసాద్, సాధానాల శివ భగవాన్, యరమాటి వెంకన్న బాబు, సయ్యద్ రబ్బానీ, కోళ్ల శ్రీనివాస్, టపా పులేశ్వరరావు, గణపతి, కొనాల చంద్ర బోస్, ఏం గణపతి తదితరులు ఉన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

condolence  to MLC Thota Trimurthulu

You cannot copy content of this page