TRINETHRAM NEWS

26,98,931 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు రూ.5,060.49 కోట్ల సాయం

ఈ నాలుగేళ్లలో మొత్తం సాయం రూ.19,189 కోట్లు.. ఒక్కొక్క మహిళకు రూ.75 వేల

చంద్రబాబు పేరు చెబితే మోసాలు దాగాలు గుర్తుకు వస్తాయి.. అదే దత్త పుత్రుడు పేరు చెబితే అమ్మాయిలమి మోసం చేసే విషయాలు గుర్తుకు వస్తాయి

చంద్రబాబు 2014లో బీసీలకు 143 వాగ్దానాలు చేశాడు, కానీ నెరవేర్చింది ‘సున్నా’: సీఎం జగన్

అనకాపల్లి జిల్లా క‌శింకోట మండ‌లం పిసినికాడలో నేడు సీఎం జగన్ వైయస్ఆర్ చేయూత నిధులు విడుద‌ల చేశారు. పిసినికాడ స‌భా వేదిక నుంచి కంప్యూట‌న్ బ‌ట‌న్ నొక్కి 26,98,931 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ల‌బ్ధిదారుల‌కు గానూ రూ.5,060.49 కోట్ల సాయాన్ని అందించారు. ఒక్కో ల‌బ్ధిదారు ఖాతాలో రూ.18,750 చొప్పున న‌గ‌దు జ‌మ చేశారు. ఈ సందర్భాగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు.

మహిళా దినోత్సవం ముందురోజు అక్క చెల్లెమ్మలకు ఆర్థిక సాయం చేయడం సంతోషంగా ఉందని, 58 నెలల పరిపాలనలో అక్క చెల్లెమ్మల ఆర్థిక సాధికారతే లక్ష్యంగా ముందుడుగు వేశామని, అక్కచెల్లెమ్మల సాధికారితకు దేశంలో మరే రాష్ట్రం చేయని విధంగా చేయూత అందించాం వైఎస్సార్‌ చేయూత కార్యక్రమంతో ప్రతీ మహిళకు ఆర్థిక స్వావలంబన చేకూరిందిని సీఎం గన్ వెల్లడించారు. ఇప్పటికే మూడు విడతలుగా రూ.18,750 చొప్పున ప్రభుత్వం ప్రతి మహిళకు రూ.56,250 చొప్పున అందజేశామని, నాలుగో విడతగా అందించే మొత్తంతో ఒక్కొక్క మహిళకు రూ.75 వేల సాయం అందించినట్టవుతుందని చెప్పారు. 4వ విడతగా అందించే రూ.5,060.49 కోట్లతో కలిపి ఇప్పటివరకు వైయ‌స్ఆర్ సీపీ ప్రభుత్వం ఈ ఒక్క పథకం ద్వారానే రూ.19,189.60 కోట్లు అందించినట్టవుతుందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 45–60 ఏళ్ల మధ్య వయసు గల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కుటుంబాలు శాశ్వత జీవనోపాధి పొందేలా ప్రతి నెలా స్థిర ఆదాయం లభించేలా మన ప్రభుత్వంలో 2020 ఆగస్టు 12న ఈ పథకాన్ని ప్రారంభించినట్లు సీఎం వివరించారు.

రానున్న 14 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా చేయూత నిధుల కార్యక్రమం కొనసాగుతోందని తెలిపారు.గత ప్రభుత్వం అక్క చెల్లెమ్మల కోసం ఏరోజు ఆలోచించలేని, పాదయాత్రలో ఇచ్చిన హామీని నెరవేర్చుకుంటూ ఆర్థిక సాయం అందించామని, అక్కచెల్లెమ్మలకు ఆర్థిక భరోసా కల్పించినందుకు గర్వపడుతున్నానని ఆనందం వ్యక్తం చేశారు.

1,68,018 మంది అక్క చెల్లెమ్మలు కిరణా దుకాణాలు నడుపుతున్నారని,3,80,466 మంది అక్కచెల్లెమ్మలు ఆవులు, గేదెలు కొన్నారని,
1,34,514 మంది గొర్రెలు, మేకలు పెంపకం చేస్తున్నారని, 3,98,422 మంది అక్కచెల్లెమ్మలు అగ్రికల్చరల్ ప్రాడక్ట్స్ వ్యాపారాలు చేస్తున్నారని, మరో 2,59,997 మంది అక్కచెల్లెమ్మలు మిగిలిన రకరకాల కార్యక్రమాలు చేస్తూ ఇంటిని కూడా నడుపుతున్నారంటే అక్షరాలా 16.55,991 మంది అక్కచెల్లెమ్మలు ఈరోజు ఏదో ఒక వ్యాపారం చేస్తూ తమ కుటుంబాన్ని తాము ప్రతి అక్కచెల్లెమ్మ కనీసం రూ.6-10 వేలు సంపాదించుకుంటూ చిక్కటి చిరునవ్వులతో తాను బతుకుతూ, తన కుటుంబానికీ తోడుగా ఉందంటే మార్పు ఒకసారి గమనించాలని కోరారు. ఇలా మనం మహిళా సాధికారత లక్ష్యంగా అడుగులు వేశామని వివరించారు.

అక్కచెల్లెమ్మలు సంతోషంగా ఉండాలని, వాళ్ల కుటుంబాలకు మంచి జరగాలని ఈ 58 నెలల కాలంలో ఆలోచన చేస్తూ విద్యాపరంగా, ఆర్థికపరంగా, సామాజిక పరంగా, రాజకీయ పరంగా, జెండర్ పరంగా, నా అక్కచెల్లెమ్మల భద్రతపరంగా వారందరి సాధికారత లక్ష్యంగా గొప్పగా అడుగులు వేశామని పేర్కొన్నారు. చేయూత ద్వారా అక్కచెల్లెమ్మలకు రూ.75వేలు ఇస్తున్నామని, 31 లక్షల ఇళ్ల స్థలాలకు పట్టాలు ఇచ్చామని, గత ప్రభుత్వంలో ఇలాంటి మంచి పనులు జరిగాయా?అని ప్రశ్నించారు. ఎక్కడా లంచాలు లేవని చెప్పారు.

“దేశంలో ఎక్కడా జరగని విధంగా, ఈ 58 నెలల కాలంలోనే మీ బిడ్డ ప్రభుత్వంలో మాత్రమే జరుగుతోంది.వైయస్సార్ ఆసరా ద్వారా, వైయస్సార్ సున్నావడ్డీ ద్వారా పొదుపు సంఘాలకు మళ్లీ ఊపిరి పోశాం. గతంలో పొదుపు సంఘాలన్నీ కుదేలైపోయి, ఎన్ పీఏలు, ఔట్ స్టాండింగులుగా 18 శాతం చిన్నాభిన్నమైపోయిన పరిస్థితి నుంచి పొదుపు సంఘాలకు ఊపిరి పోశాం.అక్కచెల్లెమ్మలు తమ కాళ్లమీద తాము నిలబడేట్టు చేసి ఇప్పుడు ఏకంగా 99.83 శాతం రుణాల రికవరీతో దేశంలోనే మన అక్కచెల్లెమ్మల పొదుపు సంఘాలు నంబర్ 1లో ఉన్నాయి. గత ప్రభుత్వం అక్కచెల్లెమ్మలకు మోసం చేసిన చరిత్రే ఉంటే, మన ప్రభుత్వం ఆ అక్కచెల్లెమ్మలకు అండగా ప్రతి అడుగులో నిలిచిన చరిత్ర మనది. గతానికి, ఇప్పటికి తేడా చూడండి” అని సీఎం కోరారు.

45-60 సంవత్సరాల మధ్య వయసున్న కాపు అక్కచెల్లెమ్మలు, ఈబీసీ అక్కచెల్లెమ్మలకు ఏటా రూ.15000 ఇస్తూ, వారి ఆర్థిక పటిష్టతకు తోడ్పాటు ఇస్తున్న ప్రభుత్వం కూడా మీ బిడ్డ ప్రభుత్వమేనని, గత చంద్రబాబు ప్రభుత్వంలో అక్కచెల్లెమ్మలకు ఇలాంటి స్కీమే లేదని, సొంతిల్లు లేని పేదింటి అక్కచెల్లెమ్మల పేరుమీద కేవలం ఈ నాలుగు సంవత్సరాల్లోనే ఏకంగా 31 లక్షల ఇళ్ల స్థలాలు అందజేసిన ప్రభుత్వం కూడా మీ బిడ్డ ప్రభుత్వమేనని ఉద్గాటించారు. అందులో 22 లక్షల ఇళ్లు నిర్మిస్తున్న ప్రభుత్వం కూడా దేశ చరిత్రలో ఎప్పుడూ జరగని విశేషమని అన్నారు. ప్రభుత్వంలో ఇలా ఇళ్ల స్థలాలుగా కనీసం ఒక్కరికంటే ఒక్కరికైనా ఒక్క సెంటైనా ఒక్క అక్కచెల్లెమ్మకైనా ఇచ్చాడా అంటే… ఇచ్చింది సున్నా. కట్టింది అరకొర ఇళ్లని, చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా తొలిసారిగా అక్కచెల్లెమ్మల రక్షణ కోసం భద్రత విషయంలో ప్రతి గ్రామ, వార్డు సచివాలయంలో ఓ మహిళా పోలీసును, నా అక్కచెల్లెమ్మలకోసం నియమించామని, ప్రతి అక్కచెల్లెమ్మల ఫోన్లో ఒక దిశ యాప్, దిశ పోలీస్ స్టేషన్లు, దిశ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు.. ఇలా వ్యవస్థ నెలకొల్పింది మీ బిడ్డ ప్రభుత్వమేనని తెలిపారు.

చంద్రబాబు, దత్తపుత్రుడు పు చెబితే మేసాలే గుర్తుకువస్తాయి

“చంద్రబాబు, దత్తపుత్రుడు.. వీరిద్దరి పేరు చెబితే అక్కచెల్లెమ్మలకు ఏం గుర్తుకొస్తుంది? చంద్రబాబు పేరు చెబితే మూడుసార్లు సీఎంగా, అక్కచెల్లెమ్మలకు చేసిన మోసాలు, వంచనలు గుర్తుకొస్తాయి. పొదుపు సంఘాలకు చేసిన దగా గుర్తుకొస్తుంది. విశ్వసనీయతలేని చంద్రబాబు గుర్తుకొస్తాడు. మరి దత్తపుత్రుడి పేరు చెబితే వివాహ వ్యవస్థకే ఓ కళంకం. ఓ మాయని మచ్చగా గుర్తుకొస్తాయి. కార్లు మార్చినట్లు భార్యలను మార్చేది, ఈ విలువలు లేని ఈ దత్తపుత్రుడే అని గుర్తుకొస్తుంది. వీరిద్దరూ కలిసి ఇంటింటికీ పంచిన, వీరిద్దరి ఫొటోలతో కలిపి సంతకాలు చేసి మేనిఫెస్టోఅని చెప్పి 2014లో అక్కచెల్లెమ్మలకు మేనిఫెస్టోలో వీరిద్దరూ కలిసి ఏం వాగ్దానాలిచ్చారో ఒకసారి గుర్తుకుచేసుకుందామా?” అని సీఎం ప్రశ్నించారు

  • రూ.14,205 కోట్లు పొదుపు సంఘాల రుణాలన్నీ మొదటి సంతకంతో రద్దు చేస్తామన్నారు.
  • అక్కచెల్లెమ్మలు బ్యాంకుల్లో పెట్టిన బంగారం అంతా విడిపిస్తాం అని వాగ్దానాలు చేశారు.
  • టీవీల్లో అడ్వటైజ్ మెంట్ వచ్చేది. ఒక చెయ్యి వచ్చి తాళిబొట్టు లాగేసేవారు, ఇంకో చేయి వచ్చి పట్టుకుని బాబొస్తున్నాడు, బ్యాంకుల్లో – పెట్టిన బంగారం విడిపిస్తాడని అడ్వటైజ్ మెంట్ ఇచ్చారు.
  • ప్రతి ఇంటికీ ఏటా 12 గ్యాస్ సిలిండర్ల మీద ప్రతి సిలిండర్ మీద నెలకు 100 చొప్పున సంవత్సరానికి 1200, 5 సంవత్సరాల్లో 6 వేల – – – సబ్సిడీ ఇస్తామని 2014లో ఇద్దరూ కలిసి ఇచ్చిన మేనిఫెస్టోలో చెప్పారు.
  • మహిళల రక్షణ కోసం ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామని వాగ్దానంచేశారు.
  • ఆడ బిడ్డ పుట్టిన వెంటనే రూ.25 వేలు బ్యాంకు డిపాజిట్ చేస్తామని వాగ్దానం చేసి దానికో పేరు కూడా పెట్టారు. మహాలక్ష్మి అని – – – – – అమ్మవారి పేరు పెట్టారు. మొదటి సంతకంతో బెల్ట్ షాపులు రద్దు చేస్తామని వాగ్దానం చేశారు.
  • పండంటి బిడ్డ అనే పథకం, పేద గర్భిణీ స్త్రీలకు 10 వేలు ఇస్తామని చెప్పారు.
  • ఇవన్నీ 2014లో వీరిద్దరూ కలిసి చెప్పినవి.
  • బడికి వెళ్లే ప్రతి ఆడపిల్లలకు సైకిళ్లు, ప్రతి అక్కచెల్లెమ్మకూ స్మార్ట్ ఫోన్ ఉచితంగా ఇస్తామన్నారు. మహిళా పారిశ్రామిక వేత్తలకు కుటీర లక్ష్మి అని వాగ్దానం చేశారు.

ఇవన్నీ ఇదే చంద్రబాబు, ఇదే దత్తపుత్రుడు ఇద్దరూ కలిసి ఫొటోలు పెట్టి సంతకాలు పెట్టి ప్రతి ఇంటికీ పంపిణీ చేశారు.
2014 ఎన్నికల ముందు ఇచ్చిన ఈ వాగ్దానాల్లో ఏ ఒక్క వాగ్దానామైనా కూడా ఈ బాబు, దత్తపుత్రుడు అమలు చేశారా? అని అడుగుతున్నా?

ఇద్దరూ కలిసి 2014లో మేనిఫెస్టోలో ఇవన్నీ చెప్పి అక్కచెల్లెమ్మలు నమ్మిన వారిని నట్టేట ముంచి, ఒక్క రూపాయి కూడా పొదుపుసంఘాల రుణాలు తీర్చకుండా చంద్రబాబు దత్తపుత్రుడు ఎగ్గొట్టారు. అక్కచెల్లెమ్మలను అప్పులపాలు చేశారు. అప్పటిదాకా అమల్లో ఉన్న సున్నావడ్డీ పథకాన్ని సైతం అక్టోబర్ 2016 నుంచి రద్దు చేశారు. బ్యాంకుల్లో పెట్టిన బంగారం బాబు విడిపిస్తాడని నమ్మి డబ్బు కట్టని వారి బంగారాన్ని బ్యాంకులు వేలం వేస్తుంటే ఇదే చంద్రబాబు చోద్యం చూస్తూ నిలబడ్డాడు తప్ప ఆదుకోవాలని మనసు రాలేదు.

అమ్మవారి పేరు పెట్టి వాగ్దానాలు చేసి మోసం చేశారు- సీఎం జగన్

గ్యాస్ సిలిండర్ల మీద నెలకు ఐదేళ్లూ కలిసి రూ.6 వేలు సబ్సిడీ అన్న వీరు.. అక్కచెల్లెమ్మలకు ఒక్క రూపాయి కూడా సబ్సిడీ మీద ఇచ్చిన పుణ్యం కట్టుకోలేదు.ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేయకపోగా, విజయవాడలో కాల్ మనీ సెక్స్ రాకెట్లు నడిపించి వీరి జాయింట్ ప్రభుత్వం అక్కచెల్లెమ్మల జీవితాలను ఛిన్నాబిన్నం చేసింది. ఆడబిడ్డ పుట్టిన వెంటనే రూ.25 వేలు డిపాజిట్ చేసిన వీరు.. మీలో ఏ ఒక్కరికైనా, మీకు తెలిసిన ఏ ఒక్కరికైనా కనీసం ఆడబిడ్డ పుడితే ఒక్క రూపాయి అయినా డిపాజిట్ చేశాడా?
ఇలాంటి అబద్దాలు, ఇలాంటి మోసాలతో చంద్రబాబు పేరు చెబితే గుర్తుకొచ్చేది మోసం, మోసం, దగా, దగా. చివరకు అమ్మవారి పేరును కూడా ఆటవస్తువుల్లా ఉపయోగించుకున్నారు. అమ్మవారి పేరు పెట్టి వాగ్దానాలు చేసి మోసం చేసిన వీరు మళ్లీ ఆ మోసాన్ని కొనసాగిస్తూ ఈరోజు మహాశక్తి అని మోసానికి తెరతీస్తున్నారు. బిడ్డ పుడితే ఇస్తానన్నది ఒక మోసం, గర్భిణీ తల్లులకు చేసిన వాగ్దానం ఇంకో మోసం, బడికి వెళ్లే ఆడపిల్లలకు చేసిన వాగ్దానం మరో మోసం, ఇల్లాలికి ఇస్తానన్న సిలిండర్ల సబ్సిడీ సైతం ఇంకో మోసం, పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు చేస్తానన్న రుణ మాఫీ దారుణమైన మోసం.

బెల్ట్ షాపులు రద్దు చేస్తామని ఎక్కడ పడితే అక్కడ ప్రోత్సహించడం ఇంకో దుర్మార్గమైన మోసం, అవ్వలకు సైతం ఓట్ల కోసం చివరి రెండు నెలలు మాత్రమే పెన్షన్ పెంచి చేయాలనుకున్నది ఇంకో గజ మోసం.
పెన్షన్ కూడా 4 సంవత్సరాల 10 నెలలు ఇచ్చింది వెయ్యి. ఎన్నికలకు కేవలం 2 నెలల ముందు మాత్రమే 2 వేలు ఇచ్చేశాం అని ఎక్కడ పడితే అక్కడ ఊదరగొడుతున్నారు.
కడుపులో ఉన్న బిడ్డ మొదలు, పెద్ద వయసులో ఉన్న అవ్వల వరకు అక్కచెల్లెమ్మలందరికీ వీరు చేసిన మోసం, దగా ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి.
మళ్లీ అక్కచెల్లెమ్మలకు ఇంటింటికీ ఇంత ఇస్తామని, బీసీ అక్కచెల్లెమ్మలకైతే ఇంకా ఎక్కువ ఇస్తామని, మళ్లీ కొత్త అబద్ధాలు, కొత్త మోసాలు. ఇవి మళ్లీ మొదలయ్యాయి.
ఎన్నికలు వచ్చినప్పుడే చంద్రబాబుకు బీసీలు గుర్తుకొస్తారు.
ఇదే బాబు ఇదే దత్తపుత్రుడు 2014లో బీసీలకు ఏకంగా 143 వాగ్దానాలు చేశారు. చేసింది మాత్రం ఏకంగా ఒక పెద్ద సున్నా.
సామాజిక వర్గాలుగానీ, అక్కచెల్లెమ్మల్లో ఏ ఒక్కరైనా వీరిని నమ్మడం అంటే కాటేసే పామును,తినేసే పులిని ఇంటికి తెచ్చుకోవడమే అన్నది ప్రతి అక్కచెల్లెమ్మ ఆలోచన చేయాలి.
పలాన మంచి చేశా కాబట్టి, ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకున్నాం కాబట్టి, ఇదే మంచి మరోసారి చేస్తాం అని ఓట్లు అడిగే పరిస్థితి వీరిద్దరికీ లేదు.
చంద్రబాబు పేరు చెప్పినా, ఆయన పాలన గుర్తుకొచ్చినా ఎక్కడా కూడా ఆయన పేరు చెబితే గుర్తుకొచ్చే ఒక్కటంటే ఒక్క మంచీ లేదు.
రేపు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈరోజు చేస్తున్న ఈ కార్యక్రమం మహిళా పక్షపాత ప్రభుత్వంగా ఈ 58 నెలల్లో ఏం చేశామో మీ అందరి ముందూ ఉంచడం జరిగింది.
ఇదీ మీ ప్రభుత్వం అన్నది ఎప్పుడూ గుర్తుపెట్టుకోమని అడుగుతున్నా.
ఈ ప్రభుత్వం అక్కచెల్లెమ్మల కోసం, మంచి చేయడం కోసం మీ ప్రభుత్వం అని గుర్తుపెట్టుకోమని కోరుతున్నా.
రాబోయే రోజుల్లో ఎన్ని అబద్దాలు చెప్పినా, ఎన్ని మోసాలు చేసినా అందరూ ఒకటే గుర్తుపెట్టుకోండి.
మరో నెలలో ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ మీ దగ్గరకొచ్చి కేజీ బంగారం, ప్రతి ఇంటికీ బెంజ్ కారు కొనిస్తామని చెబుతారు.
దత్తపుత్రుడు సంతకం పెట్టిన పేపర్ మీ దగ్గరకొస్తుంది.
చంద్రబాబు దత్తపుత్రుడు ఇద్దరూ కలిసి పోజులు ఇస్తూ మేనిఫెస్టో మీ ఇంటికి పంపిస్తారు.
ఎవరి వల్ల మంచి జరిగింది, ఎవరు మంచి చేస్తారు, ఎవరు మాట మీద నిలబడతారు, ఎవరికి విశ్వసనీయత ఉంది అన్నది మాత్రం మర్చిపోవద్దని మీ అందరికీ తెలియజేస్తున్నా.
మీ బిడ్డ ప్రభుత్వంలో ఈ 58 నెలల కాలంలో మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంది అనుకుంటే మాత్రం.. మీరంతా మీ బిడ్డకు సైనికులుగా, స్టార్ క్యాంపెయినర్లుగా మీరే ముందుకు రావాలని కోరుతున్నాడు.
చెడిపోయిన వ్యవస్థను మార్చడం కోసం మీ బిడ్డ అడుగులు ముందుకు వేస్తూ ప్రయాణం చేస్తున్నాడు.
చెడిపోయిన వ్యవస్థ మారాలాంటే మీ బిడ్డ ఒక్కడే ఈ పని చేయలేడు. దేవుడి దయ ఉండాలి, మీ చల్లని ఆశీస్సులు ఉంటేనే మీ బిడ్డ వ్యవస్థను మార్చగలుగుతాడు
దేవుడి చల్లని దీవెనలు, మీ ఆశీస్సులు ఎప్పుడూ మీ బిడ్డ ప్రభుత్వం మీద ఉండాలని మనసారా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ బటన్ నొక్కే కార్యక్రమానికి నాంది పలుకుతున్నా అని రసీఎం పేర్కొన్నారు.