
Case against Snake Smuggler : త్రినేత్రం న్యూస్ : వరంగల్ జిల్లా ఎనుమాముల గ్రేన్ మార్కెట్ సమీపంలోని గణేశ్ నగర్ లో పాముల (రెండు తలలుగా పేరొం దిన అక్రమ వ్యాపారం చేస్తున్న ఓ వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు వరంగల్ ఫారెస్ట్ రేంజ్ అధి కారి పొలిపాక రాధిక తెలిపారు.
ఆమె తెలిపిన వివరాల మేరకు.. గణేశ్నగర్ కాలనీకి చెందిన సతీశ్ గుర్తు తెలియని వ్యక్తుల నుంచి రెండు సజీవ ఇండియన్ రెడ్సోండ్ బోవా (ఎరిక్స్ జోని) పాములను తీసుకొని, ఒక్కోదాన్ని రూ. లక్షకు విక్ర యిస్తున్నాడన్న సమాచారం వచ్చింది.
ఈ మేరకు డీఆర్ఎ ఇంటెలిజెన్స్ అధికారులు రెక్కీ నిర్వ హించి నిందితుణ్ని పట్టుకున్నారు. రెండు పాము లను స్వాధీనం చేసుకొని అటవీశాఖ అధికారులకు అప్పగించారు.
సతీశ్పై కేసు నమోదు చేశామని, కోర్టు 14 రోజుల పాటు రిమాండు విధించినట్లు రాధికా తెలిపారు…
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe

